మనుషులను నమ్మలేక పోతున్నాము . నిన్నటి దాక ఒంగి ఒంగి సలాములు చేసినవారే మనతో అవసరం తీరి పోయాక మన ముందే మనలని విమర్శి స్తున్నారు. చాలా జాగ్రత్త గా ఉండాలి ఈ నాయళ్ళతో. మన మధ్యలో వుండి మనకే గోతులు తవ్వుతారు. నవీన్ వ్యవహారం నాకు నచ్చ లేదు. ఏమైనా మన జాగ్రత్తలో మనం వుండాలి. (ఈ వ్యవహారం అంతా అయిపోయాక, నేను ఇంటికి వెళ్ళటానికి బండి స్టార్ట్ చేస్తుంటే అతనువచ్చి చేతులు పట్టుకుని సారిల మీద సారిలు చెప్పాడు) ఏది ఏమయినా అనవసరపు నిందలు వేయవద్దు అని చెప్పను.
ఇంకో సంఘటన ఏమిటంటే రితేష్ రొజూ రామ కృష్ణ మఠానికి (సమ్మర్ క్యాంప్) వెళుతున్నాడు కదా!! దాని కోసమై తీసుకెళ్ళి తీసుకుని రావటానికి ఆరు వందలకు ఒక ఆటో ని మాట్లాడాము. ఆ ఆటో వాడు మొదటి రోజే మొత్తం డబ్బులు కావాలని గోల పెట్టాడు. ఆ గోల పడలేక సగం అంటే మూడు వందలు ఇచ్చాము. ఒక వారం రోజులు బాగానే వచ్చాడు. ఆ తర్వాత అయిపు లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ఫ్ . పాపం కొంత మంది ఆరు వందలు ఇచ్చారంట. ఎవడిని నమ్మాలో అర్థం కావటల్లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి