9, నవంబర్ 2014, ఆదివారం

వెంకట రెడ్డి ఆఖరి ఘట్టం 

అక్టోబర్ 31, 2014 మద్యాహ్నం కాలేజీ కి వెళ్దామని లంచ్ చేస్తున్నాను . ఫోన్ వచ్చింది శ్రీను గుంటూరు నుండి.
సర్లే ! తరువాత మాట్లాడదామని ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. కాసేపటికే మరో ఫోన్ అంజి రెడ్డి నుండి. ఏమై  వుంటుందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశా ! " వేణు! హాస్పిటల్ కు వెళ్ళావా ! " అని ఇంకా చెప్పబోతుంటే మనసు కీడు శంకించింది. వెంకట రెడ్డి కి ఏమైంది ? అన్నా వణుకుతున్న గొంతుతో.
"నీకు తెలియదా ? సుబ్బారెడ్డి లక్ష్మి పురం తీసుకు వద్దామనుకున్తున్నాడు. అక్కడ వాళ్ళేమనుకున్తున్నారో " అన్నాడు
నాకు పూర్తిగా అర్థం అయ్యింది. వెంకట రెడ్డి ఇక లేడని. భోజనం చెయ్య బుద్ది కాలేదు. శిల్ప తో విషయం చెప్పను. అయ్యో ! అంది.
శ్రీనుకు ఫోన్ చేసాను. "రాజేంద్ర ఫోన్ చేసి చెప్పాడు . అది చెబుదామనే నీకు ఫోన్ చేసాను" అన్నాడు
ఏదో తిన్నాననిపించి వెంటనే నిమ్స్ హాస్పిటల్ కు బయలు దేరాను.

ప్రవీణ్ కు ఫోన్ చేసి ఏ వార్డో  కనుక్కుని అక్కడకు చేరుకున్నాను. అక్కడ విష్ణు, శోభన్, ప్రవీణ్, వెంకట రెడ్డి భార్య బయట కుర్చుని వున్నారు. ప్రవీణ్, విష్ణు తో లోపలకి వెళ్ళాను.

హాస్పిటల్ బెడ్ మీద ప్రాణం లేని వెంకట రెడ్డి పడి వున్నాడు. ఆక్సిజెన్ ట్యూబ్ నోట్లేనే వుంది. శ్వాస ఆడుతున్నట్టు పొట్ట పైకి కిందికి కదులుతుంది - బ్రతికే వున్నాడా అన్నట్టు. వెంకట రెడ్డి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను, చల్లగా వుంది. ముఖం నిర్మలం గా కొంచెం ఉబ్బి  వుంది. తలకు రంగు వేసాడనుకుంటా ! గడ్డం నున్నగా షేవ్ చేసి వున్నాడు.
కాసేపటి తరువాత బయటకి వచ్చాం. కృష్ణ (వెంకటరెడ్డి భార్య) 2014 మొత్తం హాస్పిటల్ లోనే సరిపోయింది. కొత్త ఇల్లు కొన్నా, ఇంట్లో వుంది చాల తక్కువ అని బాధ పడింది. పాపం ఆ మాట నిజమే ! వెంకటరెడ్డి కూడా తన బాధల నుండి విముక్తి చెందాడు. కిడ్నీలు రెండూ  ఫెయిల్ అయ్యి నరక యాతన అనుభవించాడు. మరీ ఈ సంవత్సరమే !

ఇంతలో శేషి రెడ్డి వచ్చాడు. మరల ఇద్దరం వెళ్లి వెంకట రెడ్డి ని చూసి వచ్చాం. లోపల ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇంతలో నవీన్ (వెంకట రెడ్డి చిన్న కొడుకు ) కెనడా నుండి ఫోన్ చేసాడు. తను వచ్చే వరకు సోమవారం అవుతుంది అన్నాడు. తరువాత రాలేనన్నాడు.

అంబులన్స్ మాట్లాడి బాడీని లక్ష్మీ పురం పంపించాము. ఆ తెల్లారి శనివారం (4. 30) నేను, శేషి రెడ్డి, విష్ణు, నవీన్ (శేషిరెడ్డి కొడుకు) నలుగురం విష్ణు కారులో బయలు దేరి లక్ష్మీ పురం 8 గంటలకల్లా చేరాము.

వెంకట రెడ్డి బాడీ ని స్నానం చేయించి  పాడే మీదకెక్కించారు. దండలు, పూలు వేసారు.  గుంటూరు నుండి శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో వచ్చారు. మోహన్ ముందు రోజే వచ్చాడు. కొబ్బరి కాయలు కొట్టారు. నేను కుడా పూలు వేసి కొబ్బరి కాయ కొట్టాను. శేషి రెడ్డి, నవీను, సాంబి రెడ్డి ఇంకా అవుతు వాళ్ళు పాడే నెత్తుకున్నారు.
ఊరికి ఉత్తరాన కాలువ వడ్డున దహన సంస్కారాలు జరిపించారు.

ఇక పెద్ద కర్మ నెక్స్ట్ డే ఆదివారమే చేద్దామనుకున్నారు. తరువాత కెనడా నుండి నవీన్ వస్తాడని చెప్పారు, అందుకని 11 వ రోజు పెద్ద కర్మ జరుపుదామనుకున్నారు. అంటే 10 వ తారీఖు.

నేను  శ్రీను, వట్టిగుంట శ్రీను సుధాకర్ కారు లో పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కి వచ్చి జన్మభూమి ఎక్ష్ప్రెస్స్ లో హైదరాబాద్ వచ్చాను. ఇంటికి వచ్చే వరకు దగ్గర దగ్గర 10 గంటలయింది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి